రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతోపాటు 22 మంది టిడిపి నేతలు,కార్యకర్తలు కోర్టుకు హాజరయ్యారు. గత వైకాపా పాలనలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించారన్న సాకుతో తనపై తన కార్యకర్తలపై నాన్వేలబుల్ తప్పుడు కేసులను వైకాపా అప్పటి ప్రభుత్వం నమోదు చేసిందన్నారు. తమకు కోర్టులపై అపారమైన నమ్మకం ఉందని ధర్మం, న్యాయం కోసం తమకూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగించిందని పేర్కొన్నారు

22 మందితో కలిసి రాయదుర్గం కోర్టులో హాజరైన ఎమ్మెల్యే కాలువ
రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులతోపాటు 22 మంది టిడిపి నేతలు,కార్యకర్తలు కోర్టుకు హాజరయ్యారు. గత వైకాపా పాలనలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించారన్న సాకుతో తనపై తన కార్యకర్తలపై నాన్వేలబుల్ తప్పుడు కేసులను వైకాపా అప్పటి ప్రభుత్వం నమోదు చేసిందన్నారు. తమకు కోర్టులపై అపారమైన నమ్మకం ఉందని ధర్మం, న్యాయం కోసం తమకూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగించిందని పేర్కొన్నారు

