కలెక్టర్ దృష్టికి ఆరు కీలక సమస్యలు.. పరిష్కారానికి సానుకూల స్పందన
ప్రజల సమస్యలు పెండింగ్లో ఉండకూడదు — అధికారులకు తక్షణ చర్యల ఆదేశాలు
తిరుపతి జిల్లా:-
సత్యవేడు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరోసారి తనదైన శైలిలో ముందడుగు వేశారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం.. నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి నేరుగా తీసుకెళ్లారు….
ప్రజలకు సంబంధించిన సమస్యలు కేవలం వినతులకే పరిమితం కాకుండా, వాటికి వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరుతూ వినతిపత్రం అందజేశారు.
రేషన్ షాపుల నుంచి క్వారీ వరకు.. ప్రజా సమస్యలపై ఫోకస్


