రామాపురం మండలం *మన్నేరువాండ్లపల్లెలో రూ.20 లక్షల వ్యయంతో* నూతనంగా నిర్మించనున్న *శివాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న *శివాలయం నిర్మాణం త్వరలో పూర్తై* భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రజా సంక్షేమంతో పాటు *ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు*. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామస్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 🕉️🙏


