రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, అరకు నియోజకవర్గ టీడీపీ యువనేత సివేరి అబ్రహం శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో లోకేష్ను కలిసి అరకు నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సమస్యలను సానుకూలంగా విన్న లోకేష్, సంబంధిత అంశాలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అరకు సమస్యల పరిష్కారానికి లోకేష్కు సివేరి అబ్రహం వినతి
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, అరకు నియోజకవర్గ టీడీపీ యువనేత సివేరి అబ్రహం శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో లోకేష్ను కలిసి అరకు నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సమస్యలను సానుకూలంగా విన్న లోకేష్, సంబంధిత అంశాలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

