ఖమ్మం నగరంలోని 9వ డివిజన్ ఇంద్రనగర్ కాలనీ GHS ప్రభుత్వ పాఠశాలలో HM(FAC) శ్రీమతి గరిమెళ్ళ స్నేహలత గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత,శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.) గారు హాజరై విద్యార్థివిద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన అలవాట్లని, వాటికి పూర్తిగా దూరంగా ఉంటూ చదువు, క్రీడలు, సృజనాత్మకత, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూపించే మార్గాన్ని అనుసరిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రత్న రాజు గారు, రాజన్న గారు, రామనాథం గారు, వేణుగోపాలరావు గారు, ఖలీల్ అహ్మద్ గారు, నాగశ్రీ గారు, శశికళ గారు, శ్రీదేవి గారు, శోభారాణి గారు, తులసి అమ్మగారు, సుధారాణి గారు, గజ్జెల శ్రీనివాస్ గారు, గంజర్ల శ్రీకాంత్ గారు, అరుణ్ కుమార్ గారు, నాగేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు



