నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఇంజనీరింగ్ విభాగం పనుల పరిశీలనలో భాగంగా స్థానిక 43వ డివిజన్ చేపల మార్కెట్ రోడ్డు, కుండల దర్గా, షాది మంజిల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువల పనితీరును అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. డ్రైను కాలువలలో మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరీముల్లా, స్థానిక నాయకులు, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



