కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో డెప్యు మరియు ఇతర సానుకూల దృక్పథం కలిగిన సంస్థలతో కలిసి గ్రామాల్లో స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షా శిబిర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కరప మరియు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, తమ హెచ్ఐవి స్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీమాబాయి మహిళా మండలి సిబ్బంది మాట్లాడుతూ హెచ్ఐవి స్థితిని గురించి తెలుసుకోవడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. హెచ్ఐవి స్థితిని తెలుసుకోవడం ద్వారా ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు,హెచ్ఐవి ఉన్నట్లయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడడం ద్వారా అదుపులో ఉంచవచ్చునన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక వాహనం ద్వారా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం అయినది.

హెచ్ఐవి స్థితిని గురించి తెలుసుకోవడం అందరి సామాజిక బాధ్యత
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో డెప్యు మరియు ఇతర సానుకూల దృక్పథం కలిగిన సంస్థలతో కలిసి గ్రామాల్లో స్వచ్ఛంద హెచ్ఐవి పరీక్షా శిబిర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కరప మరియు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, తమ హెచ్ఐవి స్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీమాబాయి మహిళా మండలి సిబ్బంది మాట్లాడుతూ హెచ్ఐవి స్థితిని గురించి తెలుసుకోవడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. హెచ్ఐవి స్థితిని తెలుసుకోవడం ద్వారా ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు,హెచ్ఐవి ఉన్నట్లయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడడం ద్వారా అదుపులో ఉంచవచ్చునన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక వాహనం ద్వారా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం అయినది.

