*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 1 చిట్టమూరు మండలం,*
చిట్టమూరు మండల పరిధిలోని మల్లం సెక్టర్ పీవీ కండ్రిగ అంగన్వాడి సెక్టర్ నందు కోట సిడిపిఓ ముని కుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ కవిత మరియు సిడిపిఓ ముని కుమారి సమక్షంలో తల్లిపాలు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సిడిపిఓ మునికుమారి మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు దేవుడిచ్చిన వరం ప్రసవం జరిగిన అరగంట లోపు బిడ్డకు మొదటి వచ్చే మురిపాలు బిడ్డకు తాగించాలి అందులో కొలెస్ట్రాల్ విటమిన్ ఏకే సముద్రిక ఉండి అవి బిడ్డకు మొదటి టికా అవుతుంది. అవి వ్యాధి నిరోధిక శక్తిగా బిడ్డకు పని చేస్తాయి. కాబట్టి ప్రతి గర్భిణి ప్రసవం అయిన వెంటనే మురిపాలు త్రాగించాలి. ఎలాంటి ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు కేవలం ఆరో నెల వరకు బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి తెల్లని బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ములో గడ్డలు రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రావని వివరించారు.
సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ, గర్భిణీకి ఎనిమిది నెలల నుండే ముర్రిపాలు ప్రాముఖ్యత పై అవగాహన కలిగించాలని తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకు ప్రేమను రాగాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, పీహెచ్ఎన్ ధనలక్ష్మి, హెచ్ వి పద్మావతి, ఆశ వర్కర్లు,తల్లులు,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



