చింతకాని, జూలై
(పున్నమి ప్రతినిధి):
చింతకాని భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు కొండా గోపి అధ్యక్షతన మంగళవారం మండల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు, చింతకాని మండల ఇన్చార్జి బోయినపల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, రానున్న పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, అనగాని రామారావు, బొర్రా శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆవులూరి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



