*వెంకటగిరి పట్టణములో ఘనంగా “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచారంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మరియు రాష్ట్ర చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు కె కె చౌదరి గారు.*
*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టిన ” రెండేళ్ల పరిపాలన భాగంగా అభివృద్ధి మరియు సంక్షేమలపై ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచార కార్యక్రమం వెంకటగిరి పట్టణంలో విజయవంతంగా జరిగింది.*
*బుధవారం నాడు 3వ వార్డ్, బిసి కాలనీలోని సాయిబాబా గుడి వద్ద నుండి గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారితో కలిసి రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కె కె చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.*
*ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ*
*సంక్షేమంలో ఆదర్శం: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అర్హులైన వారికి రూ. 4000, రూ. 6000, రూ. 10000, రూ. 15000 వరకు పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు.*
*ఒకటో తారీఖునే పెన్షన్: ప్రతి నెలా 1వ తారీఖున ఉదయం 7 గంటలకే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు.*
*తల్లికి వందనం & ఇతర పథకాలు: ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే అందరికీ ఆర్థిక సాయం అందుతుందని, అలాగే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.*
*చేనేతలకు అండగా: నేత కార్మికులకు విద్యుత్ రాయితీలు, సబ్సిడీల కింద రూ. 3000 నుండి రూ. 5000 వరకు అందిస్తూ, ఏటా భారీగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.*
*రాష్ట్ర అభివృద్ధి – అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గుంతలమయంగా మార్చి అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రస్తుతం అమరావతికి తిరిగి పరిశ్రమలు వస్తున్నాయని, తద్వారా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.*
*ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మాజీ AMC చైర్మన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మాజీ పట్టణ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు, కమిటి నాయకులు, యువత నాయకులు, స్థానిక వార్డు ముఖ్య నాయకులు, యువత నాయకులు, 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మరియు పాల్గొన్నారు.*


