Thursday, 9 July 2026
  • Home  
  • ముక్కంటి లయంలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు-భక్తులకు అసౌకర్యం కలగొద్దు
- తిరుపతి

ముక్కంటి లయంలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు-భక్తులకు అసౌకర్యం కలగొద్దు

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు (చైర్మన్) కొట్టే సాయి ప్రసాద్ సోమవారం నాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేసే చౌల్త్రీలను, లాకర్ గదులను స్వయంగా పరిశీలించారు. వాటికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన పలువురు యాత్రికులతో చైర్మన్ నేరుగా మాట్లాడారు. దేవస్థానం తరఫున వారికి అందుతున్న వసతులు, అందుతున్న సేవల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ భద్రతా విభాగం పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, భద్రత విషయంలో ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆలయ అధికారులను, సిబ్బందిని గట్టిగా ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం శ్రీకాళహస్తి క్షేత్రానికి విచ్చేస్తుంటారని గుర్తుచేశారు. అలా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆలయ సిబ్బందిపై ఉందన్నారు. పరమశివుని దర్శనార్థం ఆలయానికి వచ్చే యాత్రికులు ఎవరూ కూడా ఇక్కడి వసతులపై అసంతృప్తితో తిరిగి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరికీ సంతృప్తికరమైన దర్శనం కలిగేలా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.

శ్రీ కాళహస్తి, జులై 06 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు (చైర్మన్) కొట్టే సాయి ప్రసాద్ సోమవారం నాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేసే చౌల్త్రీలను, లాకర్ గదులను స్వయంగా పరిశీలించారు. వాటికి సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన పలువురు యాత్రికులతో చైర్మన్ నేరుగా మాట్లాడారు. దేవస్థానం తరఫున వారికి అందుతున్న వసతులు, అందుతున్న సేవల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ భద్రతా విభాగం పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, భద్రత విషయంలో ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆలయ అధికారులను, సిబ్బందిని గట్టిగా ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం శ్రీకాళహస్తి క్షేత్రానికి విచ్చేస్తుంటారని గుర్తుచేశారు. అలా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆలయ సిబ్బందిపై ఉందన్నారు. పరమశివుని దర్శనార్థం ఆలయానికి వచ్చే యాత్రికులు ఎవరూ కూడా ఇక్కడి వసతులపై అసంతృప్తితో తిరిగి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరికీ సంతృప్తికరమైన దర్శనం కలిగేలా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.