ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతిని)
మనుబోలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు నుంచి మడమనూరు సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీకి కూలి పనులకు వెళ్తున్న ఆటో, రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒక మహిళకు ఒక చెయ్యి పూర్తిగా తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనుబోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 25 (పున్నమి ప్రతిని) మనుబోలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు నుంచి మడమనూరు సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీకి కూలి పనులకు వెళ్తున్న ఆటో, రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒక మహిళకు ఒక చెయ్యి పూర్తిగా తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

