బి. దొడ్డవరంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో రాజోలు జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో రాజోలు, అప్పనపల్లి జట్లు తలపడగా రాజోలు జట్టు విజయాన్ని సాధించింది. టోర్నమెంట్ విజయవంతమైన నిర్వహణలో గెడ్డం వెంకటేశ్వరరావు గారి కృషి విశేషంగా నిలిచింది. విజేత జట్టుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సిపి ఐటీ అధ్యక్షులు తోరం గౌతం రాజు గారి చేతుల మీదుగా రూ.12,000 నగదు బహుమతి అందజేశారు. రన్నరప్ అప్పనపల్లి జట్టుకు మొహిదిన్ (ఫహాద్) టెండర్స్ ఆధ్వర్యంలో రూ.7,000 బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



