ఎం ర్ రాఘవేంద్ర పున్నమి ప్రతినిధి నెల్లూరు.
– ఉదయగిరి డిపో బస్సుకు ఘోర రహదారి ప్రమాదం.
– 13వ తేదీ రాత్రి పామూరు నుంచి గండిపాలెం, ఉదయగిరి మీదుగా బెంగళూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు.
– ప్రమాదానికి గురైన బస్సు ఉదయగిరి డిపోకు చెందిన 5212 సర్వీస్ నెంబర్ గల బస్సుగా గుర్తింపు.
– తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బెంగళూరుకు సమీపంలోని చింతామణి వద్ద జరిగిన ఘటన.
– రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టిన ఉదయగిరి డిపో బస్సు.
– ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు.
– క్షతగాత్రులలో పది మందికి తీవ్ర గాయాలు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
– ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు.
– గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలింపు.
– ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం.
– పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది


