Saturday, 23 May 2026
  • Home  
  • మిషన్ భగీరథ నీరు వృథా… పట్టించుకోని అధికారులు!
- E-పేపర్

మిషన్ భగీరథ నీరు వృథా… పట్టించుకోని అధికారులు!

మిషన్ భగీరథ నీరు వృథా… పట్టించుకోని అధికారులు! రంగారెడ్డి జిల్లా – ఇబ్రహీంపట్నం నియోజకవర్గం – యాచారం మండలం – మల్కిస్ గూడా గ్రామపంచాయతీ గత రెండు రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా లక్షల లీటర్ల తాగునీరు రోడ్డుపై వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన వీధిలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్నారు. స్థానికులు పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు వేల లీటర్ల నీరు వృథా కావడం బాధాకరం. వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మిషన్ భగీరథ నీరు వృథా… పట్టించుకోని అధికారులు!

రంగారెడ్డి జిల్లా – ఇబ్రహీంపట్నం నియోజకవర్గం – యాచారం మండలం – మల్కిస్ గూడా గ్రామపంచాయతీ
గత రెండు రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా లక్షల లీటర్ల తాగునీరు రోడ్డుపై వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని ప్రధాన వీధిలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్నారు.
స్థానికులు పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు వేల లీటర్ల నీరు వృథా కావడం బాధాకరం.
వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.