ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 18 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు చేపడుతున్నారని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్కు ఫిర్యాదు చేశారు. పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల కాలుష్యంతో మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాలకు చెందిన వెయ్యిమంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే రొయ్యల సాగు నిలిపివేయాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు దిగుతామని హెచ్చరించారు.

రొయ్యల సాగుతో రైతుల్లో ఆందోళన.. తహసిల్దార్కు వినతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 18 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు చేపడుతున్నారని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్కు ఫిర్యాదు చేశారు. పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల కాలుష్యంతో మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాలకు చెందిన వెయ్యిమంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే రొయ్యల సాగు నిలిపివేయాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు దిగుతామని హెచ్చరించారు.

