తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు బిజెపి నాయకులు కోలా ఆనంద్ కుమార్ కూడా పాల్గొన్నారు. ముందుగా పూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ కన్నుమూసిన టిడిపి సీనియర్ నాయకులు చెత్తమ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అక్కడి నుండి గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు, ఇటీవల స్వర్గస్తులైన కుమారి తల్లి గోగినేని సుబ్బమ్మ నివాసానికి చేరుకున్నారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బొజ్జల పరామర్శ
తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు బిజెపి నాయకులు కోలా ఆనంద్ కుమార్ కూడా పాల్గొన్నారు. ముందుగా పూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ కన్నుమూసిన టిడిపి సీనియర్ నాయకులు చెత్తమ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అక్కడి నుండి గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు, ఇటీవల స్వర్గస్తులైన కుమారి తల్లి గోగినేని సుబ్బమ్మ నివాసానికి చేరుకున్నారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

