దుత్తలూరు: పున్నమి తెలుగు దినపత్రిక దుత్తలూరు ఇంచార్జ్ నేలటూరి ధనుంజయ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి పున్నమి రిపోర్టర్లను నియమించి సంస్థను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
మండల ఇంచార్జ్లు, నియోజకవర్గ ఇంచార్జ్లతో సమన్వయంగా పనిచేస్తూ పున్నమి తెలుగు దినపత్రికను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, విశ్వసనీయమైన వార్తలను ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
భవిష్యత్తులో నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా ఎదిగి, మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందించడంతో పాటు, సమష్టి సహకారంతో పున్నమి తెలుగు దినపత్రికను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ప్రధాన లక్ష్యమని నేలటూరి ధనుంజయ తెలిపారు.


