ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఆదివారం ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పేదవాడి ఆకలిని గుర్తించి రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు.

మనుబోలులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఆదివారం ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పేదవాడి ఆకలిని గుర్తించి రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు.

