గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారము రంగోళి పోటీలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసి చూపరులను ఆలోచింపచేశారు. ఈ ముగ్గుల పోటీలకు డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీవాణి న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. మాధవి గ్రూపు సెకండ్ బిఎస్సి మొదటి బహుమతి గెలుచుకోగా, సూర్య మౌనిక గ్రూపు థర్డ్ బీకాం ద్వితీయ బహుమతి, శ్రీనివాసులు గ్రూపు సెకండ్ బిఎ తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. శిరీష గ్రూపు ఫస్ట్ బీకాం ప్రోత్సాహక బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, కృపా కరుణ వాణి భీమవరపు లక్ష్మి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

రంగోళి ద్వారా ఎయిడ్స్ పై అవగాహన
గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారము రంగోళి పోటీలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసి చూపరులను ఆలోచింపచేశారు. ఈ ముగ్గుల పోటీలకు డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీవాణి న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. మాధవి గ్రూపు సెకండ్ బిఎస్సి మొదటి బహుమతి గెలుచుకోగా, సూర్య మౌనిక గ్రూపు థర్డ్ బీకాం ద్వితీయ బహుమతి, శ్రీనివాసులు గ్రూపు సెకండ్ బిఎ తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. శిరీష గ్రూపు ఫస్ట్ బీకాం ప్రోత్సాహక బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, కృపా కరుణ వాణి భీమవరపు లక్ష్మి, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

