(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) ఆగస్టు 05 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట
వైసిపినేత,కె.ఎం.ఆర్ దాతృత్వంతో ఎన్ ఎస్ ఆర్ కాలనీ స్మశానవాటికకు పునరుజ్జీవంనాయుడుపేట పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఏటీకట్ట వద్ద ఉన్న మాదిగలస్మశానవాటికకు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి దాతృత్వంతో పునరుజ్జీవం లభించింది. దాదాపు 600 కుటుంబాలకు ఆధారమైన ఈ స్మశానవాటిక గత కొంతకాలంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురై,శిథిలావస్థకు చేరుకుంది.ఈ విషయాన్ని గ్రహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,ఎం,ఆర్,పి,ఎస్రాష్ట్ర అధ్యక్షుడు మాసారం గోపాల్ మాదిగ స్పందించి, స్మశానవాటిక బాగుకోసంమాధవరెడ్డిని ఆశ్రయించారు. ఎంఆర్పిఎస్ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన కలికి మాధవరెడ్డి తన సొంతనిధులతో స్మశానవాటికను పునరుద్ధరించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాసవరం గోపాల్ మాదిగ,మాట్లాడుతూ వందలాది కుటుంబాలకు ఉపయోగపడే ఈ స్మశానవాటిక శిథిలావస్థకు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.దీనిపై పలుమార్లు సంబంధిత ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరంఅని ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో స్పందించి,తన సొంత ఖర్చులతో స్మశానవాటిక రూపురేఖలు మార్చిన నాయకుడు కలికి మాధవరెడ్డికి ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, సంఘ నాయకులు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు.వ్యక్తిగత దాతృత్వంతో పునరుద్ధరణ పనులు పూర్తయినందున,ఇకనైనా సంబంధిత అధికారులు, తక్షణమేస్పందించాలని గోపాల్ మాదిగ కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు,మాదిగ సంఘాలప్రతినిధులు పాల్గొన్నారు



