శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు శుక్రవారం నాడు 150వ వందేమాతరం జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయరాలు కె సుచరిత నేతృత్వంలో బీజేపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విద్యార్ధినుల చేత వందేమాతరం పూర్తి గీతాన్ని పాడించి, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతిజ్ఞ చేయించి, కరపత్రాలను వితరణ చేసారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 150వ వందేమాతరం జయంతి వేడుకలను చేపట్టామని వందేమాతరం గీతం జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్పూర్తి కలిగిందని వక్తలు వెల్లడించారు. ఈ వందేమాతరం గీతాన్ని 1875 నవంబరు 7 వ తేదీన బంకీంచంద్రఛటర్జీ రచించారని, వందేమాతరం అంటే మాతృభూమికి నమస్కారం చేయడమని అర్థమని భాజపా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కె. సుచరిత, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ తో పాటు ఉపాధ్యాయబృందం, విద్యార్థునులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా వందేమాతరం 150వ జయంతి వేడుకలు
శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు శుక్రవారం నాడు 150వ వందేమాతరం జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయరాలు కె సుచరిత నేతృత్వంలో బీజేపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విద్యార్ధినుల చేత వందేమాతరం పూర్తి గీతాన్ని పాడించి, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతిజ్ఞ చేయించి, కరపత్రాలను వితరణ చేసారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 150వ వందేమాతరం జయంతి వేడుకలను చేపట్టామని వందేమాతరం గీతం జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్పూర్తి కలిగిందని వక్తలు వెల్లడించారు. ఈ వందేమాతరం గీతాన్ని 1875 నవంబరు 7 వ తేదీన బంకీంచంద్రఛటర్జీ రచించారని, వందేమాతరం అంటే మాతృభూమికి నమస్కారం చేయడమని అర్థమని భాజపా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కె. సుచరిత, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ తో పాటు ఉపాధ్యాయబృందం, విద్యార్థునులు పాల్గొన్నారు.

