*దుబాయ్*
*దుబాయ్లో మూడో రోజు పర్యటనలో యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*
• యూఏఈ ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ
• ప్రస్తుతం భారత్- యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించిన నేతలు
• ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశం భేటీలో చర్చ
• సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై చర్చించిన యూఏఈ ఆర్ధిక శాఖ మంత్రి.
• స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చ
• ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం
• ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు, కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ప్రస్తావించిన యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి.
• లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై చర్చించిన సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి.

