*సేవా కార్యక్రమాలతోనే సమాజ ప్రగతి*
*చిన్నారులకు పట్టుచీరలు పసుపు కుంకమలు.. వెండి పట్టీలు*
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
సమాజంలో ప్రగతి సాధించాలంటే అందుకు ఎవరికి తోచిన రీతిలో వారు సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే సాధ్యమవుతుందని జనసేన పార్టీ నాయకులు 32 వ వార్డు కార్పొరేటర్ కందులనాగరాజు అన్నారు.. ఆదివారం ఇక్కడ
ఎల్లపు వారి వీధికి చెందిన ఆశ
నేరెళ్ల కోనేరు కు చెందిన గాయత్రి లకు వారి శుభకార్యాల సందర్భంగా నూతన పట్టు చీరలు పసుపు కుంకుమలు వెండి పట్టీలు కానుకగా అందజేశారు . అలాగే ఇద్దరు చిన్నారులను కందుల ఆశీర్వదించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిధి మేరకు సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.. అందుకోసం ప్రత్యేకంగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశానన్నారు.. అనాధలకు నిరుపేదలకు నిరంతరం ఆపన్న హస్తం అందిస్తున్నట్లు చెప్పారు.
నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు చిన్నారుల శుభకార్యాలకు పట్టు వస్త్రాలు ఇతర సామాగ్రి.. నిత్యవసర వస్తువులు పంపిణీ . చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇలా నిరంతరం అనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయా కార్యక్రమాలకు గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు
గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజ సేవలో కందుల ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. తన పరిధి మేరకు రోజు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపట్టడం అందరికీ సాధ్యం కాదన్నారు. దాతృత్వం కలిగి ఉంటేనే దానం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.. అనంతరం చిన్నారులును వారు తల్లిదండ్రులు తో కలిసి నాగరాజు .. గంట్ల శ్రీనుబాబు, శోభన్ బాబు ఫ్యాన్స్ సిటీ అధ్యక్షులు కనకరాజు.
వార్డులో నేతలు కే కృష్ణ.. సిపిఐ బుజ్జి.. కే అప్పారావు.. నాగేంద్ర.. కుమారి ..వర ..శ్రీదేవి.. కొండమ్మ.. జానకి .mవై ఆది బాబు.. బాబులు శీను తత్తులంతా పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.. 32 వార్డులో కందుల నాయకత్వం వర్ధిల్లాలంటూ అక్కడ ప్రజలు జేజేలు పలికారు


