అమడగూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మండల అధికారులు పేర్కొన్నారు.మండలంలో స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను శనివారం ఎంపీడీవో మునెప్ప,పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెలలో మూడో శనివారంను స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు.స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.అనంతరం కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు.అనంతరం కార్యాలయాలు,పాఠశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప,ఎంఈఓ జిలాన్ భాష,పంచాయతీ కార్యదర్శులు మమత,ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం.
అమడగూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మండల అధికారులు పేర్కొన్నారు.మండలంలో స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను శనివారం ఎంపీడీవో మునెప్ప,పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెలలో మూడో శనివారంను స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు.స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.అనంతరం కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు.అనంతరం కార్యాలయాలు,పాఠశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప,ఎంఈఓ జిలాన్ భాష,పంచాయతీ కార్యదర్శులు మమత,ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

