T.Ravinder
పున్నమి Daily న్యూస్
ప్రతినిథి : ఖమ్మం
*నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలి*!
*ఖమ్మం బిజెపి 2 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినతులు*!
వార్త….
ఖమ్మం 2 టౌన్ :
ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లోనెలకొన్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని
ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు *వెంకటనారాయణ* ఆధ్వర్యంలో అందజేశారు. ఖమ్మం పట్టణం పరిధిలో 44వ డివిజన్, ఎన్ ఎస్ టీ,రోడ్ క్యూర్ హాస్పిటల్ లైన్, లెనిన్ నగర్, బాలాజీ నగర్, నెహ్రూ నగర్, ఏరియాలలో హాస్పిటల్స్ వెళ్లే సామాన్య ప్రజలకు, ఆ ఏరియా నివాసులకు,వాహనదారులకు, ఎమర్జెన్సీ పేషెంట్ల అంబులెన్స్లకు ట్రాఫిక్ రద్దీగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి కి , రూల్స్ కి విరుద్ధంగా హాస్పిటల్ కి సంబంధించిన బిల్డింగ్స్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్, రోడ్స్ ని ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల, ఇరుకు రోడ్లు కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, 53,57,56 డివిజన్లకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం బైపాస్ రోడ్ లో విజయనగర్ కాలనీ సాయిబాబా ఆర్చ్ దగ్గర కొత్త బస్టాండ్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి నియంత్రించాలని, వినతి పత్రం అందచేశారు, ఈ కార్యక్రమంలో ఖమ్మం బిజెపి టూ టౌన్ నేతలు, *మందడపు సుబ్బారావు,మేకల నాగేందర్, దాసరి మధు, రుద్ర గాని మాధవ్గౌడ్, కృష్ణ చారి, మహేందర్ సింగ్,నక్క రవి గౌడ్, పాశం శ్రీనివాసరెడ్డి, భూక్యా వెంకట్, ఉపేంద్రమ్మ, సురేష్ గౌడ్,యుగంధర్ నాయుడు*, తదితరులు పాల్గొన్నారు,


