తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని సిద్దార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలుగు భాష ఎంతో మధురమైనది అని దేశంలో అత్యధికులు మాట్లాడే భాషలలో ఒకటని,తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగుభాషా దినోత్సవం జరుపుకుంటామని,మన తెలుగు భాష క్రీ.శ 575 లో రేనాటి చోళరాజులు తొలి తెలుగు శాసనాన్ని వేయించినట్లు ఆదారాలు తెలియజేస్తున్నాయి అని తెలుగు భాష పురాతనమైనది అంతటి పురాతన భాష మన మాతృభాష అని దానికి మనం గౌరవించాలని విద్యార్థులకు తెలియజేశారు.పర భాషను అవసరం మేరకు ఉపయోగించాలని ,మాతృభాషను మరవకూడదని సూచించారు.మనం ఎక్కడ ఉన్నా మన కన్న తల్లిని ఉన్న ఊరిని మాతృభాషను మరవకూడదని తెలిపారు,ఆ తరువాత విద్యార్థుల కు వ్యాసరచన,వక్తృత్వ పోటీ లను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని సిద్దార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలుగు భాష ఎంతో మధురమైనది అని దేశంలో అత్యధికులు మాట్లాడే భాషలలో ఒకటని,తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగుభాషా దినోత్సవం జరుపుకుంటామని,మన తెలుగు భాష క్రీ.శ 575 లో రేనాటి చోళరాజులు తొలి తెలుగు శాసనాన్ని వేయించినట్లు ఆదారాలు తెలియజేస్తున్నాయి అని తెలుగు భాష పురాతనమైనది అంతటి పురాతన భాష మన మాతృభాష అని దానికి మనం గౌరవించాలని విద్యార్థులకు తెలియజేశారు.పర భాషను అవసరం మేరకు ఉపయోగించాలని ,మాతృభాషను మరవకూడదని సూచించారు.మనం ఎక్కడ ఉన్నా మన కన్న తల్లిని ఉన్న ఊరిని మాతృభాషను మరవకూడదని తెలిపారు,ఆ తరువాత విద్యార్థుల కు వ్యాసరచన,వక్తృత్వ పోటీ లను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

