*30 మందికి కంటి అద్దాలు పంపిణి..*
(*చెందోడు )*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 కోట మండలం*
సేవాస్ఫూర్తిదాత మదర్ థెరిస్సా గారి జయంతిని పురస్కరించుకొని ఎం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు దృష్టిలోపం ఉన్నవారికి బుధవారం కంటి అద్దాలను పంపిణీ చేశారు.
కోట, వాకాడు,చిట్టమూరు మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి
అందులో దృష్టి లోపం ఉన్న వారిని గుర్తించారు.
వారిలో 30 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి అవసరమైన నాణ్యమైన కంటే అద్దాలను ఎం వి రావు ఫౌండేషన్ వారు తయారుచేసి దృష్టిలోపం ఉన్న వారందరికీ కంటి అద్దాలు పంపిణీ చేశారు.
దృష్టిలోపం నివారించడమే మా ఫౌండేషన్ లక్ష్యం అని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.



