*ఛలో ఢిల్లీ 17న దళితుల ఆత్మగౌరవ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం*
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన – న్యాయవాది రాకేష్ ను అరెస్టు చేసేదాకా ఉద్యమిద్దాం*
*మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసిన – తెలంగాణ రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు
గద్వాల నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలకేంద్రం లోని స్థానిక మేడికొండ చౌరస్తా నందు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామేలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తలపెట్టిన చలో 17న ఢిల్లీ దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడి జరిపిన న్యాయవాది రాకేష్ ను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని అన్నారు.మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన చలో ఢిల్లీ 17 న దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం విజయవంతం చేయుటకై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లాలోని ప్రతి దళిత సోదరుడు ఢిల్లీలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయిజ జానయ్య,సురేష్,బాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.


