ఈ నెల 24 నుంచి టీజీ సీపీగేట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు.
ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు టీజీసీపీగేట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు.
➡️ వచ్చే నెల 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని,
➡️ 11న సరిచూసుకునేందుకు ఎడిటింగ్,
➡️ 14న మొదటి జాబితాను వెల్లడించనున్నట్లు చెప్పారు.
➡️ సీటు సాధించిన విద్యా ర్థులు వచ్చే నెల 18 వరకు ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీలలో రిపోర్టు చేయాలన్నారు.

