గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం. ఎంపీ హరీష్ బాలయోగి
పి గన్నవరం నుండి ఆగస్టు 18
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిష్ లాండింగ్ సెంటర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.జిల్లా అధికార యంత్రాంగం ఇండియన్ కోస్ట్ గార్డ్,ఇండియన్ నేవీ,మెరైన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలన్నారు.వేటకు వెళ్లి మత్స్యకారులు మూడు రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో ఫోన్ అందుబాటులో ఉన్నారని, కానీ నేటికి వేటకు వెళ్లి 16 రోజులు కావస్తుందని వివరించారు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని ఎంపీ హరీష్ అన్నారు.


