నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే వారికి అవసరమైన పూజా ద్రవ్యాలతో పాటు దేవస్థానం తరఫున ముత్తైదువాయనం అందజేస్తామని తెలిపారు.వ్రతంలో పాల్గొనదలచిన వారు ఉదయం 10.30 గంటలకు ఆలయం లోపల ఉండాలని సూచించారు.

21న వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే వారికి అవసరమైన పూజా ద్రవ్యాలతో పాటు దేవస్థానం తరఫున ముత్తైదువాయనం అందజేస్తామని తెలిపారు.వ్రతంలో పాల్గొనదలచిన వారు ఉదయం 10.30 గంటలకు ఆలయం లోపల ఉండాలని సూచించారు.

