కొడవలూరు మండలం కొత్త వంగల్లు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చక్కా లక్ష్మీనరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో, మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేడు వారి స్వగృహాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ చక్కా లక్ష్మీనరసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుమారుడు చక్కా మనోహర్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి వైసీపీ నాయకులు పెనాక సుభాష్, సూలం హరిబాబు, మల్లి చంద్ర వంశీ, ఎంపీటీసీ ప్రసాద్, నవీన్ పెంచలయ్య, సురేష్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.



