*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ) ఆగస్టు 13 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
కడపట్ర పంచాయతీ తోటకట్ల గ్రామానికి చెందినకత్తి నాగరాజు విద్యుత్
షాక్ ప్రమాదానికి గురిఅయిచనిపోయాడు.మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి,తరలించారు.రోజులాగే
బాబూజీ కాలనీలో సెంట్రింగ్ పనికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇనప రాడ్లను కట్ చేసి మిద్దె పైకి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు(11 కె వి) తగిలి నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.
రెంటమల్లు శశి అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ అజయ్ కుమార్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు,చేస్తున్నారుఈఘటనతో,గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి



