మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SP శబరిష్ ఆదేశాలతో SI గండ్ర సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సర్పంచ్ ధీరావత్ వీరన్న 30 హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత రోడ్డు ప్రమాదాల నుంచి జాగ్రత్త పడాలని సూచించారు.


