డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొక్కల గోపి శ్రీనివాస్, అంబేద్కర్ కొనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ , అంబేద్కర్ కొనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, తాళ్లరేవు మండల బీజేపీ అధ్యక్షులు యానమండ్ర విజయ్ చేతుల మీదుగా తాళ్లరేవు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా దంగేటి కృష్ణమూర్తి, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ–1గా వాతాడి శివ, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ–2గా శీలం శ్రీనుకు నియా మక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి తాళ్లరేవు మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వాతాడి శివ మాట్లాడుతూ తనను పార్టీ గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర, జిల్లా మరియు మండల నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసి ప్రజాసేవకు అంకితమవుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

బీజేపీ తాళ్లరేవు మండల ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గానికి నియామక పత్రాల ప్రదానం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొక్కల గోపి శ్రీనివాస్, అంబేద్కర్ కొనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ , అంబేద్కర్ కొనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, తాళ్లరేవు మండల బీజేపీ అధ్యక్షులు యానమండ్ర విజయ్ చేతుల మీదుగా తాళ్లరేవు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా దంగేటి కృష్ణమూర్తి, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ–1గా వాతాడి శివ, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ–2గా శీలం శ్రీనుకు నియా మక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి తాళ్లరేవు మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వాతాడి శివ మాట్లాడుతూ తనను పార్టీ గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర, జిల్లా మరియు మండల నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసి ప్రజాసేవకు అంకితమవుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

