దేశ అవసరాలను దేశీయంగా తీర్చుకునే సామర్థ్యం పెరిగితేనే భద్రతా రంగంలో పూర్తి స్వావలంబన సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి, రైల్వే, విమానయాన రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం అవసరమని ఆయన అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

స్వావలంబనతోనే రక్షణ రంగం బలోపేతం: రాజ్నాథ్ సింగ్
దేశ అవసరాలను దేశీయంగా తీర్చుకునే సామర్థ్యం పెరిగితేనే భద్రతా రంగంలో పూర్తి స్వావలంబన సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. రక్షణ, అంతరిక్ష, క్షిపణి, రైల్వే, విమానయాన రంగాలకు అవసరమైన కీలక భాగాల తయారీకి ఈ కేంద్రం ఉపయోగపడనుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం అవసరమని ఆయన అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

