భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు, స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ సత్య గారు, శాసనసభ సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, శ్రీ కెవీపీ రామచంద్రరావు గారు, శ్రీ కామినేని శ్రీనివాసులు గారు, శ్రీ బొల్లినేని కిష్టయ్య గారు తదితర ప్రముఖులతో కలిసి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు గారు పాల్గొన్నారు.స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. సమాజ సేవకు అంకితమైన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు బొల్లినేని వెంకట రామారావు గారు .

స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల్లో బొల్లినేని
భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు, స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ సత్య గారు, శాసనసభ సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, శ్రీ కెవీపీ రామచంద్రరావు గారు, శ్రీ కామినేని శ్రీనివాసులు గారు, శ్రీ బొల్లినేని కిష్టయ్య గారు తదితర ప్రముఖులతో కలిసి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు గారు పాల్గొన్నారు.స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. సమాజ సేవకు అంకితమైన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు బొల్లినేని వెంకట రామారావు గారు .

