*సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19, 2026:*
స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న *”స్వచ్ఛతా హి సేవా 2026″ (19th September to 2nd October)* కార్యక్రమం సూళ్లూరుపేట RTC బస్టాండ్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు *గౌరవనీయురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ గారు* హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… “పరిశుభ్రత అనేది ఒక కార్యక్రమం కాదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత. From Campaign to Collective Action అనే నినాదంతో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. మన బస్టాండ్, మన ఊరు, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. ప్రధాని మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర ను మనమందరం కలిసి సాకారం చేద్దాం” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయడం, స్వచ్ఛతా హి సేవా అనే ముగ్గుతో ఆకట్టుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో శ్రమదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, RTC అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*ఇట్లు,*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయం,*
*సూళ్లూరుపేట నియోజకవర్గం.*


