పున్నమి న్యూస్ , కాకినాడ జిల్లా ప్రతినిధి:కాకినాడ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో 500 కేజీల 18 అడుగుల జీడిపప్పు వినాయక మండపంలో 500 మంది మహిళలతో భారీ కుంకుమ పూజ నిర్వహించారు.ఆలయ కమిటీ శ్రీ సిద్ది వినాయక విశాఖ ప్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ పూజ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 500 మంది మహిళలతో ఇంత భారీ ఎత్తున కుంకుమ పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆద్యాత్మికానికి పుట్టినిల్లు లాంటిది కాకినాడ కేంద్రమని కాకినాడ లో వున్న దేవాలయాలు మరేచోట ఉండవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మికానికి పెద్దపీట వేస్తుంది.అలాగే వారి ఆధ్వర్యంలో కాకినాడలో పలు పురాతన దేవాలయాలకు పునఃనిర్మణానికి భారిగా నిధులను సమకూర్చడం జరిగిందని అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రం కాకినాడకి నేను శాసనసభ్యునిగా ఉండడం నాకు చాల అదృష్టంగా భావిస్తున్నాని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నాని అన్నారు.
కమిటీ సబ్యులు మాట్లాడుతూ
గత 12 సంవత్సరాలుగా మా కమిటీ సభ్యులు అంత కలిసికట్టుగా వుంటూ అందరూ ఒక మాటమీదుగా వుంటూ గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం 500 కేజీలతో 18 అడుగుల జీడిపప్పు వినాయక విగ్రహం చేయడం జరిగిందని గణపతి నవరాత్రులలో భాగంగా ఈ కుంకుమ పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు.
Uploaded Video:



