అరకులోయ మండలం సుంకరిమెట్టలో ₹35 లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించిన ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు ప్రసవానికి వారం రోజుల ముందుగానే సురక్షిత వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్రం లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందేలా ఇటువంటి కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సుంకరిమెట్టలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి
అరకులోయ మండలం సుంకరిమెట్టలో ₹35 లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించిన ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు ప్రసవానికి వారం రోజుల ముందుగానే సురక్షిత వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్రం లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందేలా ఇటువంటి కేంద్రాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

