నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీవో (RDO) పావని సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పావని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ రెవెన్యూ, పరిపాలనా అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ శాఖ పనితీరు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సారంగపాణి,సిబ్బంది పాల్గొన్నారు.


