చిట్వేల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ పట్టణంలోని సత్తెమ్మ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకమయ్య స్వామివారిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, రాజుకుంట నరసింహ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.సత్తెమ్మ వీధి యువత ఆహ్వానం మేరకు విచ్చేసిన నాయకులకు స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించాలని, శ్రీ వినాయకమయ్య స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్
చిట్వేల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ పట్టణంలోని సత్తెమ్మ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకమయ్య స్వామివారిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, రాజుకుంట నరసింహ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.సత్తెమ్మ వీధి యువత ఆహ్వానం మేరకు విచ్చేసిన నాయకులకు స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించాలని, శ్రీ వినాయకమయ్య స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

