ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 67వ వార్డు పారిశుద్ధ్య కార్మికులు, నవత, బియ్యంపిఎస్ కార్మికులతో కలిసి పతాకావిష్కరణలు నిర్వహించారు. అనంతరం కొత్త గాజువాకలో సిపిఎం శాఖ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు ఆధ్వర్యంలో ఫ్రూట్ మర్చెంట్లు, కళాశీలతో మేడే కార్యక్రమం జరిగింది. డాక్టర్ రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 60 మంది వ్యాపారులు, కార్మికులు హాజరై కార్మిక ఐక్యతను ప్రతిబింబించారు.


