శ్రీకాళహస్తి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కోతలు లేకుండా సరఫరా: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా వినియోగదారులకు ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు: ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

విద్యుత్ అధికారులతో బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష.. లో-వోల్టేజ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాళహస్తి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కోతలు లేకుండా సరఫరా: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా వినియోగదారులకు ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు: ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

