విద్యార్హత లేకుండా ప్రిన్సిపల్గా కొనసాగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.
కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోజరీ హైస్కూల్లో ప్రిన్సిపల్గా కొనసాగుతున్న ఫాదర్ సునీల్కు అవసరమైన విద్యార్హతలు లేకపోయినా ప్రిన్సిపల్గా కొనసాగించడం సరికాదని, దీనిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని SFI పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం విద్యాశాఖ అధికారి ఓబులేష్ కి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్యదర్శి వీరపోగు రవి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు.వారన్నారు.
ఈ విధానం లో విద్యాశాఖ అధికారులు ఇలాంటి అనధికార ఎలాంటి విద్యార్హత లేని వారిని పెట్టడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని వారన్నారు. కేవలం చదువు అడ్డుపెట్టుకొని వ్యాపారంగా చేసే ఇలాంటి వారిని విద్యాసంస్థల్లో పెట్టడం వల్ల ఎంతో విలువ కలిగిన ఎంతో మంది విద్యార్థులు ఆ యొక్క పాఠశాలలో చదువును అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలను బ్రష్టు పట్టే అవకాశం ఉందని. ఇప్పటికైనా ఎటువంటి విద్యార్హత లేని ఫాదర్ సునీల్ పై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు, మరియు కడప డయాసిస్ అధికారులకు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.


