Saturday, 18 July 2026
  • Home  
  • విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హర్షం
- తిరుపతి

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హర్షం

శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో, ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశంలోని తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఘట్టమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ, భారత శాస్త్రవేత్తలు సవాళ్లను సమర్థంగా అధిగమించి మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం దేశ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రైవేట్ సంస్థలకు కల్పించిన అవకాశాల ఫలితంగానే భారతదేశం ఈ చారిత్రక విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఇస్రో మార్గదర్శకత్వం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటోందని అన్నారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, స్కైరూట్ ఏరోస్పేస్ బృందం, ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో మరిన్ని ఘన విజయాలను సాధిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

శ్రీ కాళహస్తి, జులై 18, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో, ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశంలోని తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఘట్టమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ, భారత శాస్త్రవేత్తలు సవాళ్లను సమర్థంగా అధిగమించి మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం దేశ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రైవేట్ సంస్థలకు కల్పించిన అవకాశాల ఫలితంగానే భారతదేశం ఈ చారిత్రక విజయాన్ని సాధించగలిగిందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఇస్రో మార్గదర్శకత్వం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో భారత అంతరిక్ష రంగం ప్రపంచంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటోందని అన్నారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, స్కైరూట్ ఏరోస్పేస్ బృందం, ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశం విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో మరిన్ని ఘన విజయాలను సాధిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.