పున్నమి జులై
( పున్నమి ప్రతినిధి)
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరిక ప్రకారం, రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో చోటుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండండి.
చెట్ల కింద, బలహీన నిర్మాణాల సమీపంలో నిలబడవద్దు.
వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి.
రైతులు పంటలు, వ్యవసాయ పరికరాలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.



