Friday, 15 May 2026
  • Home  
  • లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
- తూర్పు గోదావరి

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళ్లపూడి రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి జనార్ధన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. పని గంటల పెంపు, మహిళలతో రాత్రి షిఫ్టులు చేయించడం వంటి నిబంధనలను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైస్‌మిల్ హమాలి కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళ్లపూడి రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి జనార్ధన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. పని గంటల పెంపు, మహిళలతో రాత్రి షిఫ్టులు చేయించడం వంటి నిబంధనలను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైస్‌మిల్ హమాలి కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.