ఖమ్మం: భారతదేశ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నరకుల్లా వెంకటేశ్వరరావు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
దేశానికి రక్షణ కల్పించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు కూడా అంతే ముఖ్యమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను రైతులకు విస్తృతంగా వివరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఖమ్మం జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు, రైతులు మరియు ప్రజలను పార్టీతో అనుసంధానం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దేశ ప్రగతిలో రైతుల పాత్ర కీలకమని, రైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని ఆయన అన్నారు.



